12న పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య భేటీ
NEWS May 10,2025 06:04 pm
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెర పడింది. ఈ మేరకు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అధికారికంగా వైట్ హౌస్ వేదికగా ప్రకటించారు. ఇరు దేశాలు శనివారం 5 గంటల నుండి యుద్దం ఆపేసినట్లు భారత్ ప్రకటించిందని తెలిపారు. కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరించారు యుఎస్ఏ భారత కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు.