శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. విమానాశ్రయానికి 10 కి.మీ పరిధిలో ఇది వర్తిస్తుందన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డ్రోన్లపై నిషేధం జూన్ 9 వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.