అందాల పోటీల కార్యక్రమానికి సీఎం దూరం
NEWS May 10,2025 04:38 pm
మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ సుందరీమణులకు చౌమహల్లా ప్యాలెస్లో ఇవ్వాలనుకున్న డిన్నర్ క్యాన్సిల్ చేశారు. సాయంత్రం 6 గంటలకు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయ్యాయి.