పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అమెరికా ఫోన్
NEWS May 10,2025 11:44 am
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో అమెరికా సీరియస్ గా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ కు ఫోన్ చేశారు. వెంటనే వెనక్కి తగ్గాలని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు . ఇదే సమయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ చైనా ప్రకటించింది.