పాక్ దాడిలో డీడీసీ రాజ్ కుమార్ మృతి
NEWS May 10,2025 08:14 am
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాయాది పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. టర్కీ సాయంతో తెచ్చుకున్న డ్రోన్లను భారత్ పైకి ప్రయోగిస్తోంది. తాజాగా జమ్ము కాశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. జమ్మూ లోని రాజౌరీ ప్రాంతంలో పాక్ జరిపిన దాడుల్లో రాజౌరీ అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్ కుమార్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీఎం ఫరూక్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. ఎవరూ బయటకు రావద్దని కోరారు.