తిరుమలలో భద్రతా దళాల తనిఖీలు
NEWS May 10,2025 07:32 am
భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనివున్న నేపథ్యంలో తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనికీ చేశారు.