పాకిస్తాన్ కు టర్కీ 400 డ్రోన్లు
NEWS May 10,2025 07:25 am
భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు టర్కీ ఇచ్చిందని ఆరోపించారు ఇండియన్ కల్నల్ సోఫియా ఖురేషి. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగిందన్నారు. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశామన్నారు. అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసిందన్నారు. దాన్ని గుర్తించి నాశనం చేశామన్నారు.