రాజ్ నాథ్ సింగ్ అత్యవసర భేటీ
NEWS May 10,2025 07:17 am
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర భేటీ అయ్యారు. మరోసారి త్రివిధ దళాధిపతులతో సమావేశం అవుతారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, వింగ్ కమాండర్స్ దాడులకు సంబంధించి వివరాలు వెల్లడించారు.సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. పాక్ దూకుడును అడ్డుకునేందుకు సమాలోచనలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి స్పందించాలని ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు.