మురళి నాయక్ కు శ్రద్ధాంజలి ఘటించిన జువ్వడి
NEWS May 10,2025 06:41 am
దేశ రక్షణ కోసం జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ముష్కరులు జరిపిన కాల్పులలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వీర జవాన్ మురళి నాయక్ మృతి చెందడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . మెట్ పల్లి మండలం చౌలమాద్ది గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులతో కలిసి కొవ్వతులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జువ్వడి కృష్ణారావుతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .