గురుద్వార్ పై పాకిస్తాన్ దాడి
NEWS May 09,2025 07:45 pm
గురుద్వార్ పై పాకిస్తాన్ దాడి చేసిందన్నారు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్గా కుట్రలకు పాల్పడిందన్నారు. పైగా ప్రార్ధన మందిరాలపై దాడి చేయలేదని అబద్దం చెబుతోందన్నారు. దాడి చేయడమే కాకుండా ఇండియన్ ఆర్మీనే అమృత్సర్ మీద దాడి చేసి నింద తమ మీద వేస్తున్నారని మండిపడ్డారు.