ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ
NEWS May 09,2025 07:37 pm
భారత, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త నేపథ్యంలో ఢిల్లీలోని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. దేశానికి చెందిన త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. తాజా పరిణామాలను ప్రధాని మోడీకి వివరించారు త్రివిధ దళాధిపతులు .