మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కంటతడి
NEWS May 09,2025 06:37 pm
జమ్మూకశ్మీర్ లో సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు మృతి చెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ .కళ్ల ముందే ఆడుకున్న చిన్న పిల్లలు అంతలోనే రక్తపు మడుగులో కనిపించారంటూ వాపోయారు. ఎదురుకాల్పుల్లో ప్రాణాలు వదిలిన మహిళలు, చిన్నారులు చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నించారు. జమ్మూ ప్రజలు ఇంకెంత కాలం ఇలా బాధపడుతూ ఉండాలని అన్నారు