ఇండిగో విమానాలు రద్దు
NEWS May 09,2025 06:25 pm
భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ పలు ప్రాంతాల్లో ఇండిగో విమానాలు రద్దు చేసింది.శ్రీనగర్, జమ్ము, అమృత్సర్, లెహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్పూర్, కిషన్గఢ్, రాజ్కోట్ నుండి మే 10వ తేదీ వరకు విమానాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్రం తీసుకునే నిర్ణయాల మేరకు తాము తదుపరి నిర్ణయంపై పునరాలోచిస్తామని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తామని తెలిపింది. ఈ అసౌకర్యానికి మన్నించాలని కోరింది ఇండిగో సంస్థ.