నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు కాంగ్రెస్ విరాళం
NEWS May 09,2025 05:06 pm
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. విరాళంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. సీఎం సూచనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో చర్చించి విరాళం ప్రకటించనున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.