రాజస్థాన్లో హై అలర్ట్
NEWS May 09,2025 05:02 pm
భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేసింది ఆయా రాష్ట్రాల సీఎస్ లకు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జైసల్మేర్, రాంఘడ్, బడ్మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో బ్లాకౌట్ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఇళ్లలోనే ఉండాలని ఆర్మీ పేర్కొంది. నిన్నటి లాగే ఇవాళ కూడా జైసల్మేర్ లో పాక్ దాడులకు దిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎవరూ కూడా ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ హెచ్చరించింది.