దేశం కోసం ప్రార్థనలు చేయండి
NEWS May 09,2025 02:19 pm
దేశం కోసం ప్రార్థనలు చేయాలని బీజేపీ నేతలకు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు. పాక్ తో పోరాడుతున్న భారత సైన్యం, ప్రధాని మోడీ, దేశం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో రెండు రోజుల పాటు పూజలు నిర్వహించాలని సూచించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం సురక్షితంగా ఉండాలని ప్రార్థనలు చేయాలని కోరారు.