యాదవ సంఘం భవనానికి భూమి పూజ
NEWS May 09,2025 06:32 pm
మల్యాల మండలం ముత్యంపేట (క్రాస్ రోడ్) లో మండల యాదవ సంఘం భవనానికి ఎంపీ లాడ్స్ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రూ. 5 లక్షలు నిధులు మంజూరు చేయడంతో శుక్రవారం యాదవ సంఘం సభ్యులు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ శ్రీనివాస్, మల్లేశం, వెంకటస్వామి యాదవ్, సత్యనారాయణ, నాగరాజు, నరేష్, మండల యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.