కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్
NEWS May 09,2025 08:37 am
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. డ్రోన్లు, ఇతర మందుగుండు సామాగ్రితో పశ్చిమ సరిహద్దుల్లో పాక్ సాయుధ దళాలు దాడులు చేపట్టారు. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది పాకిస్తాన్. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. దేశం సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామన్నారు భారత్ ఆర్మీ.