ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రజల కోసమే హైడ్రాను తీసుకు వచ్చామన్నారు. ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. నీళ్లు వెళ్లాల్సిన నాలాలు, చెరువులను కబ్జా చేశారన్నారు. ఆ నీళ్లు ఇళ్లలోకి వచ్చి మన జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని వాపోయారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. వెబ్ సైట్ ను సీఎం ప్రారంభించారు. హైడ్రా కోసం కొత్త వాహనాలను అందజేశారు సీఎం.