పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో అటాక్
NEWS May 08,2025 07:15 pm
భారత సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో విచక్షణా రహితంగా దాడి చేసిందని తెలిపారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ రోజు ఉదయం పాకిస్థాన్-లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసిందన్నారు. పాక్ దాడుల్లో భారత్కు చెందిన 16 మంది అమాయక పౌరులు చనిపోయారని వెల్లడించారు. ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు.