పాకిస్తాన్ మీడియాపై కేంద్రం నిషేధం
NEWS May 08,2025 05:50 pm
కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్ మీడియా కంటెంట్ ప్రసారంపై నిషేధం విధించినట్లు తెలిపింది. ఓటీటీ, ఇతర మీడియా ప్లాట్ఫామ్స్లో రూపొందిన వెబ్ సిరీస్, పాడ్కాస్ట్, సినిమాలపై బ్యాన్ విధించినట్లు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించింది కేంద్రం.