లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది ఇండియన్ ఆర్మీ. ఇవాళ ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని అనేక ప్రదేశాలలో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ మాదిరిగానే భారత ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంది. లాహోర్లోని వైమానిక రక్షణ వ్యవస్థ తటస్థీకరించ బడిందని విశ్వసనీయంగా తెలిసింది.