మైలవరం చత్తీస్గడ్ జాతీయ రహదారిపై పి ఆర్ అపార్ట్మెంట్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మూడు పాడిగేదెలు మరణించగా ఒక గేదకు తీవ్ర గాయాలైనట్లు గేదెల యజమాని ఒరుగు వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక్కొక్కటి లక్ష రూపాయలు విలువ చేసే మూడు గేదెలు మరణించాయని తెలిపారు. పాడినే జీవనాధారంగా సాగిస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని,ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన అన్నారు.