నా కూతురిని చూసి గర్విస్తున్నా
NEWS May 08,2025 05:09 am
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషీని చూసి తాను గర్విస్తున్నానని తండ్రి తాజ్ ఖురేషీ అన్నారు. దేశం కోసం తన కూతురు మంచి పని చేయడం సంతోషం కలిగించిందని చెప్పారు. ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే.. ఆ పాకిస్తాన్ను నాశనం చేస్తానని అన్నారు. అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయాది దేశానికి లేనే లేదన్నారు. మా తాత, తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలో సేవలు అందించానని అన్నారు. ఇప్పుడు నా కూతురు ఆర్మీలో ఉండడం గర్వంగా ఉందన్నాడు తాజ్ .మతం కాదు దేశ భద్రతే ముఖ్యమని చాటి చెప్పారు.