ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
NEWS May 08,2025 05:02 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుపతి ఐఐటీ సహా ఐదు ఐఐటీలలో వచ్చే నాలుగేళ్ల కాలంలో 6500పైగా సీట్లను పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.11,828.79 కోట్లు ఖర్చుచేసి 5 ఐఐటీలలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచనుంది. మరోవైపు తెలంగాణ నుండి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిపించినా ఇక్కడున్న ఐఐటీకి నిధులు తీసుకు రాలేక పోయారన్న విమర్శలు ఉన్నాయి.