ప్రధాని నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన సమాధానం చెప్పామన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. భారత సైన్యం తన సత్తాను చాటిందన్నారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని వార్నింగ్ ఇచ్చారు. శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. పౌరుల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. ఖచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామన్నారు. అమాయకులను చంపిన వారినే తాము చంపాల్సి వచ్చిందన్నారు.