భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ లో ఆడుతున్నాడు. ఇక టెస్టుల విషయానికి వస్తే 67 టెస్టుల్లో 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు 18 హాఫ్ సెంచరీలు చేశాడు. కెప్టన్ గా 24 టెస్టులకు నాయకత్వం వహించాడు. భారత జట్టు తరపున ఇప్పటికే టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన హిట్ మ్యాన్ ఇక నుంచి భారత జట్టు తరపున ఓన్లీ వన్డేల్లో మాత్రమే ఆడతానంటూ ప్రకటించాడు.