ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని ,. ఉగ్రవాదంపై యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పించాలన్నారు. ఈ సమయంలో మనమంతా పీఎంకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్రం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు.