ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ . దుద్దెడ టోల్గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారు. ఈ సందర్బంగా బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులతో ముచ్చటించారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆరా తీశారు. ఆర్టీసీ సంస్థ కల్పిస్తున్న సౌకర్యాల పట్ల కూడా అడిగి తెలుసుకున్నారు.