ఆపరేషన్ సిందూర్ ఆర్మీ ఆపరేషన్ వివరాలను ఇద్దరు మహిళారక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించామన్నారు. కేవలం 25 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించారు.పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్, POKలో మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు కల్నల్ సోఫియా ఖురేషి. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు.