భారత్ పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూరపై తీవ్రంగా స్పందంచారు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఉగ్రవాద శిబిరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ను తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మరో పహల్గామ్ ఘటన జరగకుండా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పాలన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలన్నారు. జై హింద్ అంటూ పేర్కొనడం విశేషం.