ఆపరేషన్ సింధూర్ పై మోదీ సమీక్ష
NEWS May 07,2025 08:33 am
భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ సమీక్ష చేపట్టారు. ఆయన వార్ రూమ్ నుంచి వీక్షించారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఖచ్చితమైన దాడులను ప్రారంభించింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేపట్టాయి. ఈ సందర్బంగా మోదీ సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.