నేడు 43వ సారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి
NEWS May 07,2025 08:22 am
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. వెంటనే ఢిల్లీకి రావాలని అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై రాష్ట్ర నాయకుల నుండి ఎలాంటి సమాచారం లేక పోవడంతోనే ఢిల్లీకి పిలిచారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.