ఉత్కంఠ పోరులో గుజరాత్ విక్టరీ
NEWS May 07,2025 08:08 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 156 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం అదుర్స్ అనిపించినా ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. వర్షం అడ్డంకిగా మారడం, మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. చివరకు ప్రారంభమైన మ్యాచ్ బంతి బంతికి నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.