దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు వెలువరించింది సీబీఐ కోర్టు. దోషులుగా వీడీ రాజగోపాల్, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో పాటు పీఏ అలీ ఖాన్ కు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఎందుకు విధించకూడదంటూ జడ్జి ప్రశ్నించారు. తాను సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నానని న్యాయమూర్తిగా జనార్దన్ రెడ్డి తెలిపారు.