శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు
NEWS May 06,2025 11:01 am
తిరుమల పుణ్య క్షేత్రం కిట కిట లాడుతోంది భక్త బాంధవులతో. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 65 వేల 95 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 912 తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వచ్చినట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.