ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ లేఖ
NEWS May 06,2025 07:27 am
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది. ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న వేళ యాజమాన్యం లేఖ రాయడం కలకలం రేపింది. ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ పరిస్థితులను వివరించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏ మాత్రం రాజీ పడబోదని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో స్పష్టంగా పేర్కొంది