ఉద్యోగ సంఘాలపై సీఎం కన్నెర్ర
NEWS May 05,2025 06:42 pm
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలపై భగ్గుమన్నారు. గతంలో బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండేందుకు రిటైర్మెంట్ ఏజ్ పెంచారని అన్నారు. మీరు దాచుకున్న సొమ్ము, బెనిఫిట్స్ రూ.9 వేల కోట్లు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు సమరం అంటున్నాయి. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. సమస్య ఉంటే చర్చకు రండి, చర్చిద్దాం.. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్లు ఎవరూ బాగు పడలేదన్నారు. రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారకండి, ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవకండి అంటూ హితవు పలికారు.