మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై సమీక్ష
NEWS May 05,2025 04:41 pm
72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.