ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిని ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు పుతిన్. మరో వైపు కావాలని కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్తాన్. ఇప్పటి వరకు రెండు క్షిపణులను ప్రయోగించింది. దీనిపై సీరియస్ అయ్యారు రాజ్ నాథ్ సింగ్. యుద్దం తప్పదన్నారు.