దేశ వ్యాప్తంగా రహదారుల అభివృద్ది
NEWS May 05,2025 12:35 pm
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ రైల్వే కనెక్టివిటీని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానం జరిగిందని తెలిపారు. అదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రూ.3,900 కోట్ల చేసిన పనులను ప్రారంభించు కోవడం సంతోషంగా ఉందన్నారు.