ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తాం - పొన్నం
NEWS May 05,2025 12:07 pm
ఆర్టీసీ సంస్థలో చోటు చేసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిశారు ఆర్టీసీ జేఏసి చైర్మన్ టిఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్ధామ రెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్ ,కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్ , STMU జనరల్ సెక్రెటరీ పున్న హరి కృష్ణ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా గత కొంత కాలంగా ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు మంత్రికి.