సప్తవర్ణ శోభితం శ్రీ కోదండరాముని పుష్ప యాగం
NEWS May 04,2025 03:16 pm
తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పుష్ప యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.