బెంగుళూరుకు చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ యతీష్ సూరినేని ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.1.50 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామ కృష్ణ పాల్గొన్నారు.