పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి రాజుకుంది. భారత్ను రెచ్చగొట్టేలా రష్యాలోని పాక్ అంబాసిడర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్పై అణుబాంబులతో దాడి చేస్తామన్నారు మహ్మద్ ఖలీద్ జమాలీ. కొన్ని చోట్ల దాడులు చేస్తుందనే సమాచారం ఉందన్నారు. భారత్ దాడి చేస్తే పూర్తిస్థాయిలో దాడికి దిగుతామంటూ వార్నింగ్ ఇచ్చారు.