ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు
NEWS May 04,2025 08:59 am
ప్రముఖ యూట్యూబర్ , ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు షాక్ తగిలింది. తనపై సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజు తదితరులపై ఆరోపణలు చేశాడు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా ప్రచారం చేశాడని సుమోటాగా కేసు నమోదు చేశారు.