ఉత్తరాఖండ్ లో భూ వైకుంఠం అని పిలిచే బద్రీనాథ్ ఆలయ పవిత్ర ద్వారాలు ఆదివారం తెరుచు కున్నాయి. తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానుంది. అనాది నుంచి ఈ ఆచారం వస్తోంది . ఈ శుభ క్షణాన్ని వీక్షించడానికి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. శీతాకాలం ముగిసిన తర్వాత ఈ ప్రాంతం ఆధ్యాత్మిక మేల్కొలుపును సూచించే చార్ ధామ్ యాత్రలో ఆలయం తెరవడం అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటిగా పరిగణించ బడుతుంది.