భారత, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సరిహద్దు లోకి వచ్చేందుకు ప్రయత్నం చేసిన పాకిస్తాన్ కు చెందిన రేంజర్ ను భారత జవాన్లు పట్టుకున్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ బోర్డర్లో కలకలం చోటు చేసుకుంది. మరో వైపు పాక్ సరిహద్దు దాటిన భారత జవాన్ ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం యుద్ద వాతావరణం నెలకొంది.