జమ్ముకశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవేట
NEWS May 03,2025 07:42 pm
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భారత్ ఆర్మీ దూకుడు పెంచింది. టెర్రరిస్టుల జాడ కోసం జల్లెడ పడుతోంది. పహల్గామ్ దాడి ఘటనలో పాల్గొన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దచిగామ్, కుల్గామ్, షోపియాన్, అనంత్నాగ్ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్లు, త్రీడీ మ్యాపింగ్ సాయంతో ఉగ్ర వేట కొనసాగిస్తున్నాయి భద్రతా దళాలు.