పెద్దపల్లి జిల్లాలో మామిడికాయ పిక్క
పసిబాలుడి ప్రాణాల మీదికి తెచ్చింది
NEWS May 03,2025 11:11 pm
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మం. రానాపూర్కి చెందిన రాజశేఖర్, అశ్విని దంపతులు ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టే క్రమంలో 8 నెలల తమ కుమారుడు శ్రేయాన్స్ ఆడుకుంటూ మామిడికాయ పిక్క మింగేసిండు. అది కాస్త గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. దీంతో దిక్కుతోచని ఆ బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో బాలుడికి ప్రథమ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ కు తరలించారు.